Ram Setu | రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టును కోరారు. ఇటీవల ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించింది. రామసేతు విషయంలో ఆయన గతంలోనే పిటిషన్ దాఖలు చేయగా.. జనవరిలో కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో గురువారం పిటిషన్పై మరోసారి విచారణ జరిపింది.
తన పిటిషన్ను విచారణ జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. రామసేతు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొనగా.. దీనిపై స్పందించిన కోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి కోర్టు సూచించింది. ఇదిలా ఉండగా.. ఇంతకు ముందు జనవరి 19న పిటిషన్పై విచారణ సందర్భంగా కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత ప్రక్రయ కొనసాగుతుందని కోర్టుకు తెలిపారు.
ప్రస్తుతం సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో ప్రక్రియ కొనసాగుతుందన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో వివాదాస్పద సేతుసముద్రం జలమార్గం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుబ్రహ్మణ్య స్వామి రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2007లో రామసేతు ప్రాజెక్టు విషయం సుప్రీంకోర్టు చేరగా.. రామసేతుకు నష్టం జరుగకుండా షిప్పింగ్ మార్గానికి ఇబ్బంది లేకుండా మరో మార్గాన్ని గుర్తించాలని కేంద్రానికి సూచించింది.