న్యూఢిల్లీ : దేశంలో సంచలనం సృష్టించిన పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరుపనున్నది. సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని స్పెషల్ బెంచ్ విచారించనున్నది. జర్నలిస్టులు, పార్లమెంటేరియన్లు, ప్రముఖులపై గూఢచర్యం చేసేందుకు ప్రభుత్వం ఇజ్రాయెల్ మిలిటరీ గ్రేడ్ మాల్వేర్ను కేంద్రం ఉపయోగించిందని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు.. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ నేతృత్వంలో అక్టోబర్లో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
కమిటీ జూలైలో దర్యాప్తు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఇదిలా ఉండగా.. సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ మరో మూడు కీలక కేసులను సైతం విచారించనున్నది. బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను విడుదల చేస్తూ దాఖలైన పిటిషన్లతో పాటు, పీఎల్ఎంఏపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్తో పాటు జనవరిలో పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భద్రతా లోపాలపై దాఖలైన పిటిషన్పై సైతం సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరుపనున్నది.