న్యూఢిల్లీ: గుజరాత్కు చెందిన 68 మంది జ్యుడీషియల్ ఆఫీసర్ల (Judicial Officers) ప్రమోషన్పై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది. ఇటీవల పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష వేసిన మెజిస్ట్రేట్ హరీశ్ హస్ముక్ భాయ్ వర్మ కూడా ఆ జాబితాలో ఉన్నారు. జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని బెంచ్ తీర్పునిస్తూ.. మెరిట్ లేదా సీనియార్టీ చూడకుండా జ్యుడీషియల్ ఆఫీసర్లకు ప్రమోషన్ ఇవ్వడం సరికాదన్నది. ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో సీటీ రవికుమార్ కూడా ఉన్నారు. 68 మంది జుడిషియల్ అధికారుల్ని ప్రమోట్ చేయాలని గుజరాత్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.