న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో పాటు ఎంపీ సంజయ్ సింగ్కు సుప్రీంకోర్టు(supreme court)లో ఊరట లభించింది. ప్రధాని మోదీకి చెందిన డిగ్రీ పట్టా కేసులో ఆ ఇద్దరూ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు కోర్టులో పిటీషన్ దాఖలైంది. గుజరాత్కు చెందిన గుజరాత్ యూనివర్సిటీ ఆ పిటీషన్ వేసింది. పీఎం మోదీ డిగ్రీ వివరాలను ఆ వర్సిటీ వెల్లడించలేదని కేజ్రీవాల్, సంజయ్ సింగ్లు ఆరోపించారు. అయితే ఆ ఇద్దరు నేతలపై యూనివర్సిటీ వేసిన కేసులో సుప్రీంకోర్టు స్టే విధించింది. నాలుగు వారాల వరకు ఆ స్టే అమలులో ఉంటుందని కోర్టు తెలిపింది. జస్టిస్ బీఆర్ గవాయ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఆ తీర్పునిచ్చింది. గుజరాత్ కాకుండా మరో రాష్ట్రానికి కేసును బదిలీ చేయాలని సంజయ్ సింగ్ అభ్యర్థన పెట్టుకున్నారు. ఆ అప్పీల్ను కోర్టు కొట్టిపారేసింది. అడ్వకేట్ అభిశేక్ మనూ సింఘ్వి, వివేక్ జైన్, కరన్ శర్మలు సంజయ్ సింగ్ తరపున వాదించారు.