న్యూఢిల్లీ: పెండ్లి కాని మహిళ సరగసీ ద్వారా బిడ్డను పొందడాన్ని నిషేధిస్తున్న నిబంధనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. ప్రస్తుత సరగసీ చట్టంలోని నిబంధనలు రాజ్యాంగంలోని అధికరణలు 14, 21లను ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్ నేహా నాగ్పాల్ ఆరోపించారు. తన వ్యక్తిగత జీవితంలో ప్రభుత్వం జోక్యం లేకుండా మాతృత్వాన్ని అనుభవించాలనుకుంటున్నానని తెలిపారు.
తాను 40 ఏండ్ల మధుమేహ రోగినని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ, ఈ అంశంపై విస్తృత ధర్మాసనం విచారణ జరుపుతున్నదన్నారు. పిటిషనర్ తరపున న్యాయవాది సౌరభ్ కిర్పాల్ మాట్లాడుతూ, ఈ అంశంలో విస్తృత రాజ్యాంగ ప్రశ్న ఇమిడి ఉందని, దీనిపై విచారణ జరపాలని అన్నారు. దీంతో ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది.