న్యూఢిల్లీ: భోపాల్ గ్యాస్ ప్రమాద(Bhopal Gas Tragedy) బాధితులకు అదనపు నష్టపరిహారాన్ని ఇవ్వాలని అమెరికా కంపెనీ యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్(Union Carbide Corporation)పై కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు(supreme court) కొట్టిపారేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, అభయ్ ఓకా, విక్రమ్నాథ్, జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసం ఈ తీర్పును ఇచ్చింది. యునియన్ కార్బైడ్ సంస్థపై అదనపు భారాన్ని విధించడం సరికాదు అని, ఆ కేసును రీఓపెన్ చేయడం వల్ల మరిన్ని సమస్యల్ని సృష్టించడమే అవుతుందని ధర్మాసనం తెలిపింది.
భోపాల్ గ్యాస్ బాధితులకు ఇప్పటికే ఆరుసార్లు నష్టపరిహారాన్ని(compensation) ఇచ్చినట్లు కోర్టు చెప్పింది. ఆర్బీఐ వద్ద ఉన్న సుమారు 50 కోట్ల ద్వారా భోపాల్ గ్యాస్ బాధితుల సమస్యల్ని పరిష్కరించాలని కోర్టు పేర్కొన్నది. ఒకవేళ కేసును మళ్లీ ఓపెన్ చేస్తే అది యూసీసీకే అనుకూలం అవుతుందని కోర్టు తెలిపింది. కేంద్రం వేసిన క్యూరేటివ్ పిటిషన్(curative petition)పై జనవరి 12వ తేదీన సుప్రీం తన తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.