హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): మద్యం పాలసీ కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వచ్చే నెల 13న చేపడుతామని సుప్రీంకోర్టు చెప్పింది.
ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టు సమయం ముగియడంతో దీనిపై ప్రత్యేకంగా ప్రస్తావించిన ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది కపిల్ సిబల్ త్వరగా విచారణ జరుపాలని కోర్టును విజ్ఞప్తి చేశారు. దీంతో వచ్చే నెల 13న విచారిస్తామని కోర్టు తెలిపింది.