న్యూఢిల్లీ: హరిద్వార్లో జరిగిన ధర్మ సంసద్ సమావేశంలో విద్వేష ప్రసంగాలు చేసిన అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. హరిద్వార్లో గత ఏడాది జరిగిన ధర్మ సంసద్ కార్యక్రమంలో హిందూ నేతలు వివాదాస్పద ప్రసంగాలు చేశారు. ముస్లింలను టార్గెట్ చేయాలన్న అభిప్రాయాల్ని వినిపించారు. ఈ కేసులో దాఖలైన పిటిషన్ను ఇవాళ సుప్రీం టేకప్ చేసింది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సూర్య కాంత్, హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ధర్మ సంసద్ కార్యక్రమాలను రెగ్యులర్గా నిర్వహిస్తున్నారన్నారు. జనవరి 24వ తేదీన అలీఘడ్లో ఇలాంటి సభను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.