న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) స్థానిక పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్, గుల్ఫిషా ఫాతిమా, మీరన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్ దరఖాస్తు చేసుకున్న బెయిల్ అంశాన్ని పరిశీలించే విషయంలో ఢిల్లీ పోలీసులకు కోర్టు నోటీసులు ఇచ్చింది. 2020లో నార్త్ఈస్ట్ ఢిల్లీలో అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
జస్టిస్ అరవింద్ కుమార్, ఎన్వీ అంజారియాతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ ఆదేశాలు ఇచ్చింది. అక్టోబర్ 7వ తేదీన మళ్లీ ఈ కేసులో విచారణ చేపట్టనున్నారు. వేగంగా ఈ కేసును పరిష్కరించాలని పిటీషనర్లు కోరారు. ప్రీ ట్రయల్లోనే నిందితులు అయిదేళ్ల జైలుశిక్ష అనుభవించారని పిటీషనర్ల తరపు న్యాయవాది పేర్కొన్నారు.
సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ నిందితుల తరపున వాదించారు. దివాళీలోగా ఈ కేసును క్లోజ్ చేయాలని సిబల్ కోరారు. ఓ విద్యార్థిని అయిదేళ్లు జైలులో పెట్టడం షాకింగ్గా ఉందని సింఘ్వీ అన్నారు.
ఢిల్లీ అల్లర కేసు నిందితులకు బెయిల్ మంజూరీని నిరాకరిస్తూ సెప్టెంబర్ 2వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఖలీద్తో పాటు ఇతరులు సుప్రీంను ఆశ్రయించారు.