న్యూఢిల్లీ: ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్కు సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. పరంబీర్ను అరెస్టు చేయవద్దు అంటూ ఇవాళ సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. బెదిరింపులు, వసూళ్ల కేసులో పరంబీర్పై మహారాష్ట్ర మంత్రి అనిల్ దేశ్ముఖ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే అయితే పరంబీర్పై మహారాష్ట్రలో పలు కేసులు నమోదు అయ్యాయి. గత కొన్నాళ్ల నుంచి పరంబీర్ పరారీలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మాజీ ముంబై పోలీసు చీఫ్ను అరెస్టు చేయవద్దు అని, ఆయన సీబీఐ విచారణకు హాజరవుతారని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. తీర్పలో భాగంగా మహారాష్ట్ర, సీబీఐ, డీజీపీలకు సుప్రీం నోటీసులు కూడా ఇచ్చింది.
జస్టిస్ సంజయ్ కిషణ్ కౌల్, ఎంఎం సుందరేశ్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. పరంబీర్ తరపున సీనియర్ న్యాయవాది పునీత్ బాలి వాదించారు. ముంబై పోలీసుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, ముంబైలో అడుగుమోపిన వెంటను వాళ్ల నన్ను అరెస్టు చేస్తారని, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ పరంబీర్ సుప్రీంను వేడుకున్నారు. ఇండియాలోనే ఉన్నానని, 48 గంటల్లో సీబీఐ ముందు హాజరుకానున్నట్లు పరంబీర్ వెల్లడించారు. పరంబీర్కు దేశం విడిచి వెళ్లాలని లేదని, కానీ ప్రాణహాని ఉన్నట్లు ఆయన తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు.