న్యూఢిల్లీ: షాదీ డాట్కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్కు సుప్రీంకోర్టు(Supreme Court)లో ఇవాళ తాత్కాలిక ఊరట లభించింది. మరో రెండు వారాల పాటు అతన్ని అరెస్టు చేయవద్దు అని కోర్టు చెప్పింది. మాట్రిమోనియల్ ఫ్లాట్ఫామ్ ఆధారంగా జరిగిన ఫ్రాడ్ కేసులో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. ఈ కేసులో అనుపమ్ మిట్టల్తో పాటు మరో ఇద్దరికి కూడా రక్షణ కల్పిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టింది. అయితే ఈ కేసును మళ్లీ హైకోర్టుకు పంపించింది.
తాత్కాలిక బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాలని మిట్టల్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. హైదరాబాద్కు చెందిన ఓ మహిళ .. షాదీ డాట్కామ్పై కేసు నమోదు చేసింది. షాదీ డాట్కామ్ ద్వారా ఫేక్ ప్రొఫైల్ను సృష్టించిన ఓ వ్యక్తి తనను 11 లక్షలు మోసం చేసినట్లు ఆ మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది. యూజర్ సమాచారాన్ని ఆ ఫ్లాట్ఫామ్ సరైన రీతిలో వెరిఫై చేయలేదని ఆ మహిళ పేర్కొన్నది.