న్యూఢిల్లీ: తమిళనాడులోని వివాదాస్పద స్లెర్లైట్ కాపర్ ప్లాంట్ను తెరవడానికి సుప్రీంకోర్టు మంగళవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కాలుష్యం తమ ప్రాణాలు తీస్తున్నదంటూ 2018లో స్థానికులు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ఈ ఫ్యాక్టరీ మూతపడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా దేశంలో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి ఈ ఫ్యాక్టరీలో ఆక్సిజన్ ఉత్పత్తికి సోమవారం తమిళనాడు ప్రభుత్వం వేదాంత లిమిటెడ్ కంపెనీకి అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై మంగళవారం జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
ఇది జాతీయ సంక్షోభం. ప్రజలు చనిపోతున్నారు. స్థానికులను మనవైపుకు తిప్పుకోవాలి. పౌరుల ప్రణాలను కాపాడటం మన బాధ్యత. ఒక కోర్టుగా మనం జాతికి మద్దతు ఇవ్వాలి. ఇది జాతీయ విపత్తు అని విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. సోమవారమే ఈ ఫ్యాక్టరీలో ఆక్సిజన్ ఉత్పత్తికి తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అఖిలపక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వం కేవలం ఆక్సిజన్ ఉత్పత్తి కోసం మాత్రమే నాలుగు నెలల పాటు ఫ్యాక్టరీ తెరవడానికి అనుమతించింది. అయితే తమిళనాడుకు మాత్రం ఉచితంగా ఆక్సిజన్ను సరఫరా చేయాలని నిబంధన విధించింది.