న్యూఢిల్లీ, జూలై 14 : దివ్యాంగుల మనసు నొప్పించేలా జోకులు వేసిన ఘటనకు సంబంధించిన కేసులో కమెడియన్ సమయ్ రైనా తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో అబద్ధాలు చెప్పారంటూ సమయ్ రైనాకు రూ.3లక్షలు జరిమానా విధించింది.
ఈ మొత్తాన్ని రెండు వారాల్లోగా చెల్లించాలని, న్యాయస్థానం జారీచేసిన ఆదేశాల్ని పాటించకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం హెచ్చరించింది. ఈ కేసులో కంటెంట్ క్రియేటర్స్ రణవీర్ అల్లాబాదియా, ఆశీష్ చంచలాని దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది.