న్యూఢిల్లీ, డిసెంబర్ 4: నిందితుడు, బాధితురాలి మధ్య కుదిరిన రాజీ ఆధారంగా పోక్సో చట్టం కింద నమోదైన కేసులను కొట్టివేయొచ్చా? అనే న్యాయపరమైన ప్రశ్నను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు శనివారం అంగీకరించింది. ఇరువర్గాల మధ్య రాజీ కుదిరిన నేపథ్యంలో పోక్సో చట్టం కింద నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ 2019, ఆగస్టు 26న కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించింది. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది.