Supreme Collegium | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. 11 హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జిల బదిలీకి సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం ప్రతిపాదించింది. మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ ఏపీ హైకోర్టుకు బదిలీ కొలీజియం ప్రతిపాదించింది. కర్నాటక హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుమలత, జస్టిస్ లలిత కన్నెగంటి తెలంగాణ హైకోర్టుకు బదిలీ ప్రతిపాదించింది. పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ అభిషేక్రెడ్డి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని, తెలంగాణ హైకోర్టు జడ్జి సుజయ్ పాల్ కల్కత్తా హైకోర్టుకు బదిలీ కొలీజియం సిఫారసు చేసింది. కర్నాటక హైకోర్టుకు చెందిన జస్టిస్ వీ కామేశ్వరరావు ఢిల్లీ హైకోర్టుకు, గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జమీర్ కలకత్తా హైకోర్టుకు, గౌహతి హైకోర్టుకు చెందిన జస్టిస్ మనాష్ రంజన్ పాఠక్ ఒడిశా హైకోర్టుకు, బాంబే హైకోర్టుకు చెందిన జస్టిస్ నితిన్ వాసుదేయో సాంబ్రే ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించింది.
అలహాబాద్ హైకోర్టుకు చెందిన జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రాకు చెందిన పంజాబ్-హర్యానా హైకోర్టుకు, గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుమన్ శ్యామ్ను బాంబే హైకోర్టుకు, పంజాబ్-హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ప్రకాశ్ శర్మ రాజస్థాన్ హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వివేక్ చౌదరి ఢిల్లీ హైకోర్టుకు, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేష్ కుమార్ సింగ్ కర్నాటక హైకోర్టుకు, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ మధ్యప్రదేశ్ హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఓం ప్రకాశ్ శుక్లా ఢిల్లీ హైకోర్టుకు, రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్ బాంబే హైకోర్టుకు, పంజాబ్-హరియానా హైకోర్టు న్యాయమూర్తి సుధీర్ సింగ్ పట్నా హైకోర్టుకు, రాజస్థాన్ హైకోర్టుకు చెందిన జస్టిస్ అరుణ్ కుమార్ను ఢిల్లీ హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జయంత్ బెనర్జీ కర్నాటక హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.