Mohammad Akbar Lone | అసెంబ్లీ సాక్షిగా పాక్కు జై కొట్టిన ఎమ్మెల్యే నుంచి క్షమాపణలు కోరుతున్నట్లు సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది. జమ్ముకశ్మీర్కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత మహ్మద్ అక్బర్ లోన్ 2018లో ఆ రాష్ట్ర అసెంబ్లీలో అక్బర్ లోన్ ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినదించారు. నినాదాలు చేసినందుకు ఆయన నుంచి క్షమాపణలు కోరుతున్నట్లు పేర్కొంది. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేసిన వారిలో అక్బర్ లోన్ ప్రధాన పిటిషనర్ అని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనానికి కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత పేర్కొన్నారు. ఆయన రాజ్యాంగానికి విధేయత చూపుతున్నట్లుగా ప్రకటించాల్సి ఉందన్నారు. సభా వేదికపై నుంచి నినాదాలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలన్నారు.
అయితే, అక్బర్ తరఫున వాదనలు వినే సమయంలో ఆయన నుంచి క్షమాపణలు కోరుతున్నట్లుగా ప్రకటనను కోరుతామని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. సీనియర్ నేతల నుంచి వచ్చిన ప్రకటనలు సొంత ప్రభావాన్ని కలిగి ఉంటాయని, ఒక వేళ క్షమాపణలు చెప్పకపోతే.. ఇతరహా వ్యాఖ్యలను ఇతరులను ప్రోత్సహించేలా ఉంటాయని తుషార్ మెహతా తెలిపారు. అదే సమయంలో జమ్ముకశ్మీర్లో సాధారాణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు చేపట్టిన చర్యలపై సైతం ప్రభావం ఉంటుందన్నారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తున్న సీనియర్ న్యావాదులు రాకేశ్ ద్వివేదితో పాటు గిరి సైతం మెహత వాదనలకు మద్దతు ఇచ్చారు. ఆయన క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ను తప్పనిసరిగా సమర్పించాలన్నారు.