న్యూఢిల్లీ, జూలై 7: తమిళనాడులోని కరూర్లోని 2025 సెప్టెంబర్లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను కలవడం లేదా ఆ ఘటనపై ప్రకటనలు చేయకుండా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఇతర టీవీకే నాయకులను నిలువరించాలని కోరుతూ డీఎంకే దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. సుప్రీంకోర్టు రాజకీయ వేదికగా మార్చవద్దని జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు ఒక రాజకీయ ప్రత్యర్థి దాఖలు చేసిన అభ్యర్థనను ఎలా స్వీకరిస్తుంది? అని ధర్మాసనం డీఎంకే తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. టీవీకే ప్రచార కార్యక్రమం సందర్భంగా తొక్కిసలాట ఘనటపై జరుగుతున్న సీబీఐ దర్యాప్తునకు ఆటంకం కలిగించేలా, ఉందని పేర్కొంటూ టీవీకే నేత ఆదవ్ అర్జున చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డీఎంకే పిటిషన్లో కోర్టును అభ్యర్థించింది.