న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: సూపర్బగ్లు భారత్కు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. వాటి వల్ల ఏటా దేశంలో వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. అదే సమయంలో వైద్య ఖర్చు కూడా భారీగా పెరుగుతున్నది. ఈ మేరకు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) ఓ నివేదికలో వెల్లడించింది. సూపర్బగ్స్ వల్ల జరిగే ఆరోగ్య, ఆర్థిక నష్టాలపై ఓఈసీడీ చేసిన అధ్యయన వివరాలను గురువారం విడుదల చేసింది.
భారత్తో పాటు గ్రీస్, తుర్కియే తదితర దేశాల్లో పరిస్థితి దారుణంగా ఉందని, ఇన్ఫెక్షన్ల వల్ల దవాఖానల పాలవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని ఈ నివేదిక హెచ్చరించింది. సూపర్బగ్ కారణంగా 34 ఓఈసీడీ దేశాలతో పాటు ఈయూ దేశాల్లో ఏటా 79 వేల మంది మరణిస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. అదే సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం ఏటా సగటున 28.9 బిలియన్ డాలర్ల వ్యయం అవుతున్నట్టు పేర్కొంది. 2035 నాటికి భారత్, గ్రీస్, తుర్కియే తదితర దేశాల్లో నమోదయ్యే 40 శాతం ఇన్ఫెక్షన్లు యాంటీబయాటిక్ థెరపీ నుంచి తప్పించుకుంటాయని నివేదిక పేర్కొంది. సూపర్బగ్స్ ఓ విపత్తులా పరిణమిస్తున్నాయని హెచ్చరించింది. న్యూమోనియా, రక్త ప్రవాహం ఇన్ఫెక్షన్ తదితర ప్రమాదకర రోగాలకు సమర్థవంతమైన నివారణ లేకుండా పోతుందని పేర్కొంది.
2000 నుంచి ఏటా 2 శాతం యాంటీ బయాటిక్స్ కొనుగోళ్లు పెరిగినట్టు నివేదిక పేర్కొంది. అదే సమయంలో ఓఈసీడీ కూటమిలోని సగం దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోలేకపోయాయని వెల్లడించింది. ఇదే ట్రెండ్స్ కొనసాగితే యాంటీబయాటిక్స్ వాడకం ఇప్పట్లో తగ్గదని తెలిపింది. కాగా, 2000-2019 మధ్యకాలంలో జంతువుల్లో యాంటీమైక్రోబయల్స్ వాడకం సగానికి తగ్గించారని వెల్లడించింది.
సూపర్బగ్స్ అనేవి ప్రమాదకరమైన సూక్ష్మజీవులు. బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు, శిలీంద్రాలు తదితర సూక్ష్మజీవుల జాతులకు చెందినవే సూపర్బగ్స్. ఇవి అనేక యాంటీబయాటిక్స్లకు నిరోధకత (రెసిస్టెంట్)ను కలిగి ఉంటాయి. అనేక ఇన్ఫెక్షన్లకు వాడే మందులు, చికిత్సలను ఇవి తట్టుకుంటాయి.
ఓఈసీడీ, ఈయూ దేశాల్లో
ఏటా మృతులు-79,000
వైద్య ఖర్చు- 28.9
బిలియన్ల డాలర్లు
అధిక ప్రభావిత దేశాలు
భారత్, గ్రీస్, తుర్కియే
2035 నాటికి యాంటీబయాటిక్ నుంచి తప్పించుకునే ఇన్ఫెక్షన్లు
40 శాతం
2000 నుంచి ఏటా
యాంటీబయాటిక్ వాడకం
పెరుగుదల-2 శాతం