బెంగళూరు, నవంబర్ 8: కర్ణాటక టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్కు దరఖాస్తు చేసుకున్న ఓ అభ్యర్థిని హాల్ టికెట్పై ఆమె ఫొటోకు బదులు సన్నీ లియోన్ ఫొటో ప్రత్యక్షమైంది. రాష్ట్ర విద్యాశాఖ నిర్లక్ష్యమే దీనికి కారణమని కర్ణాటక కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్పర్సన్ బీఆర్ నాయుడు మండిపడ్డారు.
అసెంబ్లీలో నీలిచిత్రాలు చూసే నాయకులున్న పార్టీ నుంచి ఇంతకంటే ఇంకేం ఆశించగలమని చురకలంటించారు.