సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమమంత్రిగా సుఖ్వీందర్ సింగ సుఖు పేరు ఖాయమైనట్లు తెలుస్తోంది. హిమాచల్ సీఎంగా సుఖ్వీందర్ రేపు ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. హామీర్పూర్ జిల్లాలోని నదౌన్ నియోజకవర్గం నుంచి సుఖ్వీందర్ సింగ్ గెలుపొందారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన హిమాచల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా సేవలందించారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కూడా.
అయితే హిమాచల్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్నే సీఎంగా నియమించాలని ఆమె మద్దతుదారులు ఆందోళనకు దిగారు. హిమాచల్ మాజీ సీఎం వీర్భద్ర సింగ్ భార్యనే ప్రతిభా సింగ్. గతేడాది జులై నెలలో వీర్భద్ర సింగ్ మరణించిన సంగతి తెలిసిందే.
మొత్తంగా హిమాచల్ సీఎం పదవికి సుఖ్వీందర్ సింగ్, ప్రతిభా సింగ్, ముఖేశ్ అగ్నిహోత్రి పేర్లు బలంగా వినపడుతున్నాయి. అయితే ఈ ముగ్గురిలో సుఖ్వీందర్ సింగ్ వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ ఉత్కంఠకు ఈ రాత్రికి, రేపు ఉదయానికో తెర పడనుంది.