హిమాచల్ ప్రదేశ్ లోనే కాదు ఉత్తరాంఖ్ లోనూ మంచుకురుస్తోంది. చమోలీజిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న మంచుతో బద్రీనాథ్ ధామ్, ఘంగారియా, మనజిల్లాలు పూర్తిగా మంచులో మునిగిపోయాయి.
ఎక్కడ చూసినా కుప్పలుతెప్పలుగా మంచు పేరుకుపోయింది. హిమపాతం వల్ల జన జీవనం స్తంభించింది. కోవిడ్ తీవ్రత కారణంగా ఓ వైపు పర్యాటకులు లేక ఆయా రంగాలు నష్టపోతున్నాయి. మరోవైపు అకాల హిమపాతంతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు.