పూరి: శ్రీరామనవమి ((Sri Rama Navami)) సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sudarshan Pattnaik) శ్రీరాముడి సైకత శిల్పాన్ని రూపొందించారు. ఒడిశాలోని పూరీ (Puri) తీరంలో అయోధ్య ఆలయం (Ayodhya’s Ram Temple), చూడచక్కని రామయ్య (Lord Rama) చిత్రాన్ని ఇసుకతో తయారుచేశారు. హ్యాపీ రామ్ నవమి అంటూ ఈ సైకత శిల్పానికి క్యాప్షన్ ఇచ్చారు. అయోధ్య రాముని ఆలయ మీనియేచర్తోపాటు ఆరడుగుల ఎత్తున్న శ్రీరాముని విగ్రహాన్ని రూపొందించానని సుదర్శన్ పట్నాయక్ అన్నారు. ఆలయ నిర్మానం త్వరగా పూర్తికావాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. సందర్భం ఏదైనా, అంశం ఎటువంటిదైనా.. తన సైకత శిల్పాల ద్వారా ప్రపంచ శాంతి కోరే సుదర్శన్ పట్నాయక్ శిల్పాలు ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
On the eve of #RamNavami, an idol of Lord Ram along with a miniature of Ayodhya's Ram temple was made by sand artist Sudarsan Pattnaik at Puri beach in Odisha. (29.03) pic.twitter.com/nrwxU2nBog
— ANI (@ANI) March 29, 2023