చండీఘడ్: హర్యానా ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సుచిత్రా దేవి(Suchitra Devi)ని .. పార్టీ నుంచి వెలివేశారు. కాంగ్రెస్ పార్టీపై ఆమె అవినీతి ఆరోపణలు చేశారు. బావల్ నియోజకవర్గం నుంచి తనకు అసెంబ్లీ టికెట్ ఇప్పిస్తానని చెప్పి .. కాంగ్రెస్ నాయకులు ఏడు కోట్లు తీసుకున్నట్లు ఆమె ఆరోపించారు. ఆ ఆరోపణల నేపథ్యంలో హర్యానా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెరల్ చౌదరీ చర్యలు తీసుకున్నారు. తక్షణమే సుచిత్రా దేవిని పార్టీ నుంచి తొలగించాలని ఆమె ఆదేశించారు. పబ్లిక్గా కాంగ్రెస్ హై కమాండ్ నేతలపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో సుచిత్రను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు మహిళా కాంగ్రెస్ పేర్కొన్నది. అసెంబ్లీ టికెట్ ఇప్పించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏడు కోట్లు అడిగినట్లు ఇటీవల సుచిత్రా దేవి సంచలన ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర వివాదాన్ని సృష్టించాయి. అయితే ఆ ఆరోపణలు నిరాధారమైనవిన, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నట్లు ఉన్నాయని హర్యానా మహిళా కాంగ్రెస్ పేర్కొన్నది. పార్టీలో క్రమశిక్షణ పాటించే నేపథ్యంలో సుచిత్రా దేవిపై చర్యలు తీసుకున్నట్లు మహిళా కాంగ్రెస్ చీఫ్ తెలిపారు.