Brett Le To Modi | భారత్ అంటే తనకు ఎంత ఇష్టమో మీకు తెలుసునని ప్రధాని నరేంద్రమోదీకి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్లీ చెప్పాడు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ రాసిన లేఖను బ్రెట్లీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. మీ నుంచి లేఖ అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా మోదీజీ.. నాకు మోదీ భారత్ అన్నా, భారతీయులు అన్నా ఎంతిష్టమో మీకు తెలుసు. క్రికెట్ వల్ల భారత్ వంటి అందమైన దేశంలో పర్యటనకు అవకాశం రావడం గొప్ప అదృష్టం అని భావిస్తున్నా
అని ట్వీట్ చేశాడు.
బ్రెట్లీకి రాసిన లేఖలో ప్రధాని నరేంద్రమోదీ.. అద్భుతమైన ఆటతీరు, క్రీడాస్ఫూర్తితో మీరు భారత్లో ఎందరో ఫ్యాన్స్ను సంపాదించుకున్నారు. భారత సంస్కృతి, భాషల పట్ల మీకు ఉన్న అభిమానం మాకు తెలుసు. ఇండియన్స్తో మీ అనుబంధం రెండు దేశాల మధ్య సత్సంబంధాలకు నిలువెత్తు నిదర్శనం. భారత్-ఆస్ట్రేలియా మధ్య పలు సామాజిక, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. భవిష్యత్లోనూ ఇరు దేశాల మధ్య సఖ్యత యధాతథంగా కొనసాగుతుందని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు. ఈ నెల 26న 73వ రిపబ్లిక్ డే సందర్భంగా వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్గేల్, సౌతాఫ్రికా ప్లేయర్ జాంటీ రోడ్స్, ఇంగ్లండ్ మాజీ సారధి కెవిన్ పీటర్సన్లకు ప్రధాని మోదీ లేఖలు రాశారు.