ఛత్తీస్గఢ్ : బీజాపూర్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను మావోయిస్టులు అపహరించిన విషయం తెలిసిందే. బీజాపూర్లో రోడ్డు నిర్మాణ పనులకు వెళ్లిన సబ్ ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రా, అటెండర్ లక్ష్మణ్ పర్తగిరిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అయితే నిన్న సాయంత్రం అటెండర్ను విడుదల చేశారు. మావోయిస్టుల చెరలోనే సబ్ ఇంజినీర్ అజయ్ రోషన్ ఉన్నారు. అజయ్ను క్షేమంగా విడిచిపెట్టాలని అతని కుటుంబ సభ్యులు మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు.