న్యూఢిల్లీ : కోవిడ్ వ్యాక్సిన్స్తో దేశంలో యువకుల ఆకస్మిక మరణాల పెరుగుదల చోటుచేసుకోలేదని, కనీసం వ్యాక్సిన్ ఒక డోసు తీసుకున్న వారిలో అలాంటి మరణాలు తగ్గాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) చేపట్టిన సమగ్ర అధ్యయనం (Latest Study) స్పష్టం చేసింది. 2021 అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకూ దేశవ్యాప్తంగా 47 ప్రాంతీయ ఆస్పత్రుల్లో ఈ పరిశోధన చేపట్టారు. ఎలాంటి వ్యాధులు లేకుండా ఆకస్మికంగా మరణించిన 18-45 ఏండ్ల వయసు వ్యక్తుల వివరాలను విశ్లేషించింది.
729 కేసులను పరిశోధకులు అధ్యయనం చేశారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వివరించలేని కారణాలతో ఆకస్మిక మరణానికి గురయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది. సింగిల్ డోస్ తీసుకునే వారికి ఈ రక్షణ ప్రభావం లేదు. ఆకస్మిక మరణానికి పలు కారణాలు దారితీశాయని అధ్యయనం గుర్తించింది.
కోవిడ్-19తో ఆస్పత్రిలో చేరిక, ఆకస్మిక మరణానికి గురైన కుటుంబ చరిత్ర, మరణానికి 48 గంటల ముందు కఠిన వ్యాయామం, డ్రగ్స్, మత్తు పదార్ధాల వాడకం, మరణానికి 48 గంటల ముందు అతిగా మద్యం సేవించడం వంటి కారణాలున్నాయని పేర్కొంది. గతంలో కోవిడ్-19 బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురైన వారు తీవ్ర శ్రమతో చేసే పనులకు దూరంగా ఉండాలని ఐసీఎంఆర్ అధ్యయన వివరాలను ఉటంకిస్తూ గతంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ హెచ్చరించిన విషయం తెలిసిందే. గుజరాత్లో నవరాత్రి ఉత్సవాల్లో పలువురు మరణించిన నేపధ్యంలో ఆయన ఈ సూచనలు చేశారు.
Read More :
Health tips | ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే..!