అహ్మదాబాద్ : గుజరాత్లోని నదియాద్ను శనివారం ఉదయం భారీ వర్షం ముంచెత్తింది. కుండపోతతో పలు వీధులు జలమయమవడంతో వాహనదారులు (Viral Post) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరదలతో నదియాద్లోని ఖేడా ప్రాంతంలో ఓ కాలేజ్ బస్సు డ్రెయిన్లో చిక్కుకుంది. దీంతో బస్సు నుంచి బయటకు వచ్చేందుకు విద్యార్ధులకు కష్టంగా మారింది.
వరదనీటితో నిండిన కాలువ పై వంతెన నుంచి వెళుతుండగా బస్సు నీటి ప్రవాహంలో చిక్కుకుంది. వరద నీటి నుంచి బయటపడేందుకు బస్సు ఎమర్జెన్సీ విండోస్ నుంచి విద్యార్ధులు బయటపడాల్సి వచ్చింది. స్ధానికులు అక్కడికి చేరుకుని బస్సు కిటికీల నుంచి విద్యార్ధులను బయటకు తీసుకువచ్చారు.
కాగా, బిపర్జాయ్ తుపాన్ కారణంగా గతవారం ఉత్తర గుజరాత్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. బిపర్జాయ్ ప్రభావంతో బనస్కంత జిల్లాలో పలు గ్రామాలు నీట మునిగాయని అధికారులు తెలిపారు.
Read More :
Boat Capsize | వలసదారులతో వెళ్తున్న మరో పడవ బోల్తా.. 37 మంది గల్లంతు