Boat Capsize | వలసదారులతో వెళ్తోన్న మరో పడవ (Boat Capsize) మధ్యధరా సముద్రంలో బోల్తాపడింది. ట్యూనీషియా (Tunisia) – ఇటలీ (Italy) మధ్య సముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 37 మంది గల్లంతయ్యారు.
ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎమ్) తెలిపిన వివరాల ప్రకారం.. ట్యూనీషియా పోర్ట్ ఆఫ్ స్పాక్స్ నుంచి 46 మంది వలసదారులతో (migrant) పడవ ఇటలీ బయలు దేరింది. ఈ క్రమంలో బలమైన గాలుల కారణంగా వీరు ప్రయాణిస్తున్న బోటు ఇటాలియన్ ద్వీపం లాంపెడుసా వద్ద సముద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు, ఓ చిన్నారి సహా మొత్తం 37 మంది గల్లంతయ్యారు. నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం నుంచి బయటపడిన వారు ఉప-సహారా ఆఫ్రికాకు చెందిన వారు. వీరు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైన సమయంలో మరో నౌక ద్వారా ప్రాణాలతో బయటపడినట్లు ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ తెలిపింది.
ఉప –సహారా ప్రాంతం నుంచి వచ్చి ట్యూనీషియాలో అక్రమంగా నివసిస్తున్న వారిపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆఫ్రికాలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, ఆర్థికమాంద్యం కారణంగా అక్కడ జాత్యహంకార దాడులు పెరిగిపోయాయి. దీంతో ప్రజలు యూరప్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ట్యూనీషియా నుంచి మధ్యధరా (Mediterranean) సముద్రం అంతటా వలసలు పెరిగిపోయాయి.
కాగా, ఇటీవల గ్రీస్ దేశంలో భారీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సుమారు 750 మంది అక్రమవలసదారులతో వెళ్తున్న చేపల పడవ (చిన్నపాటి నౌకలాంటిది) మధ్యధరా (Mediterranean) సముద్రంలో నీట మునిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 78 మంది మరణించారు. డజన్ల కొద్ది జనం తప్పిపోయారు. దక్షిణ గ్రీస్ తీర ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
Also Read..
Rahul Gandhi | ఇకనైనా పెళ్లి చేసుకోవయ్యా.. రాహుల్ కు లాలూ సూచన.. కాంగ్రెస్ నేత సమాధానం ఏంటంటే..?
Maharashtra | 36 ఏళ్లుగా కవల సోదరుడి పిండాన్ని మోసిన వ్యక్తి.. వైద్య శాస్త్రంలోనే అరుదైన ఘటన
Guntur kaaram Movie | మహేష్ సరసన మాజీ మిస్ ఇండియా.. గుంటూరు కారంకు అసలైన ఘాటు ఇప్పుడొచ్చింది..!