కోటా (రాజస్థాన్), ఆగస్టు 30: పోటీ పరీక్షల శిక్షణ కేంద్రమైన రాజస్థాన్లోని కోటాకు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు లేదా తాత, నాన్నమ్మలు వెళ్తున్నారు. పరీక్షల ఒత్తిడి లేదా మానసిక సమస్యలతో ఈ ఏడాది ఇప్పటివరకు కోటాలో 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు తోడుగా ఉంటూ వారికి మనోధైర్యాన్ని కల్పించడానికే వీరంతా వెళ్తున్నారు. బీహార్కు చెందిన ఓ విద్యార్థి నాన్నమ్మ 80 ఏండ్ల వయసున్నా కోటాకు వెళ్లింది.