లక్నో: అర్ధరాత్రి వేళ జరిగిన పార్టీలో కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక విద్యార్థిని మరణించింది. (student shot dead) ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. 23 ఏళ్ల నిష్ఠా త్రిపాఠి లక్నోలోని బీబీడీ యూనివర్సిటీలో బీకామ్ చదువుతున్నది. బుధవారం కాలేజీలో గణేష్ వేడుక తర్వాత దయాళ్ రెసిడెన్సీ ప్రాంతంలోని ఒక ఇంటికి వెళ్లింది. స్నేహితుడు ఆదిత్య పాఠక్ సలహా మేరకు అక్కడకు వెళ్లగా అర్ధరాత్రి వరకు ఆ ఇంట్లో పార్టీ జరిగింది.
కాగా, మద్యం తాగిన యువతీయువకులు చిందులు వేశారు. ఈ పార్టీ సందర్భంగా గన్తో కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో బుల్లెట్ గాయాలతో నిష్ఠా త్రిపాఠి మరణించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అర్ధరాత్రి వరకు పార్టీ జరిగిన ఆ ఇంటికి వెళ్లారు. రూమ్లో ఉన్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మరణించిన యువతి స్నేహితుడు ఆదిత్య పాఠక్తో సహా ఆ పార్టీలో పాల్గొన్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిష్ఠా త్రిపాఠిపై ఎవరు కాల్పులు జరిపారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.