తిరువనంతపురం: పరీక్షలో ప్రశ్నాపత్రం బదులుగా జవాబు కీ ఇచ్చారు. దీంతో ఆ విద్యార్థి ఎంచక్కా ఆనర్స్ షీటులో ఆ మేరకు జవాబులు రాసి ఇచ్చాడు. ఆ విద్యార్థి జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేసే ప్రొఫెసర్ జరిగిన పొరపాటును గుర్తించారు. దీంతో ఇది యూనివర్సిటీ దృష్టికి వెళ్లడంతో ఆ పరీక్షను రద్దు చేశారు. కేరళ యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. కరోనా వల్ల బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ‘సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్’ పరీక్షకు హాజరుకాని ఒక విద్యార్థికి ఫిబ్రవరిలో మళ్లీ పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్షలో ప్రత్నాపత్రం బదులుగా జవాబు కీ ఇచ్చారు. ఆ విద్యార్థితోపాటు ఇన్విజిలేటర్ కూడా దీనిని గమనించలేదు. దీంతో ఆ విద్యార్థి జవాబు పత్రంలో జావాబు కీని పూర్తి చేసి ఇన్విజిలేటర్కు ఇచ్చాడు.
అయితే జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేసే ప్రొఫెసర్ దీనిని గుర్తించారు. ఆ విద్యార్థి జవాబు పత్రంతో పాటు అందజేసిన ఆన్సర్ కీని దానికి దానికి జత చేసినట్లు పరిశీలించారు. ప్రశ్నాప్రతం లేని విషయాన్ని గుర్తించిన ప్రొఫెసర్ ఈ విషయాన్ని యూనివర్సిటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రీ ఎగ్జామ్ను కేరళ యూనివర్సిటీ రద్దు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. అలాగే మే 3న మళ్లీ ఆ పరీక్షను నిర్వహిస్తామని పేర్కొంది.