చెన్నై: ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతడితో సంబంధం ఉన్న మహిళా టీచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమినాడు రాజధాని చెన్నైకి సమీపంలో ఈ సంఘటన జరిగింది. అంబత్తూరులోని ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్లో ఒక మహిళా టీచర్ పని చేస్తున్నది. 17 ఏళ్ల విద్యార్థి పదో తరగతి నుంచి అక్కడ చదివాడు. పాఠాలపై సందేహాల కోసం ఆ ఉపాధ్యాయురాలి ఇంటికి అతడు వెళ్లేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది.
కాగా, కొన్ని నెలల కిందట ఆ మహిళా టీచర్కు పెళ్లి కుదరడంతో విద్యార్థితో సంబంధాన్ని ముగించింది. అయితే దీనిని కొనసాగించాలని అతడు కోరాడు. ఆమె నిరాకరించడంతో ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ పరీక్షలు ముగిసిన నెల తర్వాత ఈ సంఘటన జరిగింది.
మరోవైపు ఆ విద్యార్థి ఆత్మహత్యపై అతడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. చదువు వల్ల కాకుండా ఏదో కారణం వల్ల సూసైడ్ చేసుకుని ఉంటాడని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఆ బాలుడి మొబైల్ ఫోన్ పరిశీలించారు. ఉపాధ్యాయురాలిలో కలిసి ఉన్న ఫొటోలను గుర్తించారు.
దీనిపై దర్యాప్తు చేయగా ఆ విద్యార్థితో మహిళా టీచర్ శారీరక సంబంధం గురించి బయటపడింది. దీంతో పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఉపాధ్యాయురాలిని అరెస్ట్ చేశారు.