లక్నో: బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఎమర్జెన్సీ వార్డులో నేలపై ఉంచారు. అతడి గురించి పట్టించుకోకపోవడంతో అక్కడికి వచ్చిన కుక్క ఆ వ్యక్తి రక్తాన్ని నాకింది. యూపీలోని ఖుషినగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బిట్టు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఖుషినగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడి ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు ఖాళీగా ఉన్నప్పటికీ గాయపడిన బిట్టూను నేలపై ఉంచారు. ఆ ఆసుపత్రిలో తిరిగే వీధి కుక్క కారుతున్న ఆ వ్యక్తి రక్తాన్ని నాకుతూ కనిపించింది.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బీజేపీ అధికారంలో ఉన్న యూపీ ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సంఘటనపై ఆ జిల్లా కలెక్టర్ స్పందించారు. నిర్లక్ష్యం వహించిన నర్సు, ఇద్దరు వార్డు సిబ్బంది, కాంట్రాక్టర్ ఉద్యోగులతో సహా ఆరుగురిని విధుల నుంచి తొలగించారు. వైద్యులపై చర్యల కోసం ప్రభుత్వానికి నివేదించారు. ఆ రోగిని గోరఖ్పూర్ బీఆర్డీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.
మరోవైపు తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు డాక్టర్లు ప్రయత్నించారు. ప్రమాదానికి గురై గాయపడిన ఆ వ్యక్తి తాగి ఉన్నాడని, బెడ్పై అతడ్ని ఉంచి చికిత్స అందిస్తుండగా పలుసార్లు కిందపడ్డాడని ఆసుపత్రి ఇంచార్జ్ వైద్యుడు ఎస్కే వర్మ తెలిపారు.
An accident patient is lying on the floor in Kushinagar Hospital (Uttar Pardesh). A dog was licking his blood on the floor.
And @myogiadityanath once said "Kerala Should Learn From UP's Hospitals". pic.twitter.com/wLmei21hHA
— Maharashtra Congress Sevadal (@SevadalMH) November 3, 2022