న్యూఢిల్లీ, డిసెంబర్ 27: కొవిడ్ సమయంలో తీసుకొచ్చిన ‘కొవిడ్ అడ్వాన్స్’ ఉపసంహరణ సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్వో) నిలిపివేసింది. ఈ మేరకు వారం క్రితం అధికారులతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉన్నది. కరోనా సమయంలో ఉద్యోగులు తమ వైద్య, ఆర్థిక పరమైన అవసరాలు తీర్చుకొనేందుకు ‘కొవిడ్ అడ్వాన్స్’ పేరుతో తమ పీఎఫ్ ఖాతాల నుంచి నగదు విత్డ్రా చేసుకొనే సదుపాయం కల్పించారు.