Rahul Gandhi vs BJP : దేశంలో ‘ఆర్థిక సునామీ (Financial Cricis)’ రాబోతోందని, కీలక వ్యవస్థల్లో అంతర్గతంగా అసంతృప్తి పెరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్ముందు ప్రజా వ్యతిరేకతను అణచి వేయటానికి ఎమర్జెన్సీ (Emergency) ని విధించినా విధించవచ్చని కేంద్ర ప్రభుత్వం (Union Govt) పై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ (BJP) తీవ్రంగా స్పందించింది. ప్రజలను భయపెట్టి బతుకవద్దని రాహుల్కు చురకలు వేసింది. ఆర్థిక సునామీ 2013 లోనే వచ్చిందని, ఇప్పుడు కాదని బీజేపీ నేత అమిత్ మాలవీయ సుదీర్ఘ పోస్టుపెట్టారు.
కాంగ్రెస్ వినాశనాన్ని సృష్టిస్తే బీజేపీ దృఢంగా ముందుకు వెళ్తోందని ఆ పోస్టులో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు భిన్నంగా వాస్తవ పరిస్థితి ఉందని, ఆర్థిక వ్యవస్థ బయటి నుంచి షాక్ ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ నిస్సహాయంగా లేదుని తెలిపారు. ఈ దశాబ్ద కాలంలో ఆ షాక్లను తట్టుకొనే వ్యవస్థలను నిర్మించామని చెప్పారు. విద్యుత్ వినియోగం, వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ-వే బిల్ జనరేషన్లో పెరుగుదల ఉందని, ద్రవ్యోల్బణం అదుపులో ఉందని, ఆహారం, విదేశీ మారకద్రవ్య నిల్వలు సరిపడా ఉన్నాయని మాలవీయ వెల్లడించారు.
భారత్ దృఢంగా ముందుకు వెళ్తోందనడానికి ఇవన్నీ సంకేతాలని తెలిపారు. 2011 నుంచి 2013 మధ్యలో రూపాయి 36 శాతం కుంగిందని, విదేశీ మారక నిల్వలు 294 బిలియన్ డాలర్ల నుంచి 256 బిలియన్ డాలర్లకు పడిపోయాయని విమర్శించారు. ఆర్థిక సునామీ అప్పుడే వచ్చిందని, కాంగ్రెస్ దేశాన్ని బలహీనపరిచిందని ఆరోపించారు. కొవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడిచమురు ధరలు, సరఫరా అంతరాయలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వంటి షాక్లు తగిలినా తట్టుకొనేలా దేశాన్ని మోదీ ప్రభుత్వం బలోపేతం చేసిందని తెలిపారు. ప్రజలను భయపెట్టి బతకవద్దని అని ఎక్స్ వేదికగా రాహుల్గాంధీకి మాలవీయ సలహా ఇచ్చారు.