లక్నో, ఆగస్టు 1: ఉత్తరప్రదేశ్లోని మైన్పురీ జిల్లాలో ఉన్న ఇసాన్ నదిలో ఓ పెద్ద రాయి నీటిపై తేలుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ రాయిపై హిందీలో ‘రామ్’ అని రాసి ఉన్నది. జూలై 30న చేపల వేటకు వెళ్లిన చిన్నారులకు ఈ రాయి దొరికింది. రాయి 5.7 కిలోల బరువున్నప్పటికీ నీటిలో తేలియాడుతుండటం అందరినీ ఆకర్షిస్తున్నది.
మైన్పురీ జిల్లా తానా బెవార్ ఏరియాలోని అహిమల్పూర్లో ఈ వీడియో తీశారు. లంకను చేరడానికి నీటిపై తేలియాడే రాళ్లతో రాముడు రామసేతును నిర్మించినట్టు హిందువుల విశ్వాసం. తాజాగా లభించిన రాయి ఆ రామసేతుది అయి ఉంటుందని గ్రామస్థులు చెబుతున్నారు.