న్యూఢిల్లీ, మే 29: గల్ఫ్లోని ఉద్రిక్త పరిస్థితులు, హొర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన రవాణా ప్రతిష్ఠంభనను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక గ్యాస్ నిల్వలను కనీసం 30 రోజులకు సరిపడా భద్రపరిచి ఉంచుకోవాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)లను ఆదేశించినట్టు ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మీడియాతో మాట్లాడుతూ ‘వ్యూహాత్మక నిల్వలను ఉంచడంపై మేం పనిచేస్తున్నాం.
ఈ క్రమంలో కనీసం 30 రోజుల రిజర్వ్లు ఉంచాలని ఓఎంసీలను కోరాం. వారు ఇప్పుడు దానిపైనే కసరత్తు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.