న్యూఢిల్లీ, మే 23: పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే కొన్ని రాష్ర్టాలు ఆ క్రెడిట్ తమదే అన్నట్టు చేస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ పేర్కొన్నారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళలో ఆటోమేటిగ్గా వ్యాట్ తగ్గిందని, కానీ ఆ రాష్ర్టాలు తామే సొంతంగా వ్యాట్ తగ్గించినట్టు చెప్పుకొంటున్నాయని సోమవారం ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు.
కాగా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాలొన్న ఆయన.. అంతర్జాతీయ చమురు ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బ్యారెల్ చమురుకు 110 డాలర్లు ఉన్నంత కాలం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం గురించి మాట్లాడటం కాదు.. దాని కన్నా పెద్ద సమస్యే ఎదురవుతుంది. అప్పుడు ఆర్థిక మాంద్యం గురించి మాట్లాడాల్సి వస్తుంది’అని హెచ్చరించారు.