న్యూఢిల్లీ, మే 21: మధ్య అమెరికాలోని ఎల్ సాల్వడార్లో ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతి చెందారు. స్థానిక జట్టు అయిజా, శాంత అనాకు చెందిన ఫాస్ జట్ల మధ్య కుస్కట్లాన్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో 500 మందికి పైగా గాయపడ్డారని నేషనల్ సివిల్ పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనతో మ్యాచ్ను రద్దు చేశారు. కొందరు నకిలీ టికెట్లను అమ్మారని, దీంతో సామర్థ్యానికి మించి ప్రేక్షకులు వచ్చారని, మూసేసిన స్టేడియం గేట్ ముందు పెద్దఎత్తున గుమిగూడిన క్రీడాభిమానులు తోసుకుంటూ లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.