న్యూఢిల్లీ, జూన్ 20: మానవుని అంతర్గత వికాసానికి మార్గదర్శనం చేస్తున్న ప్రాచీన కళ అయిన యోగాపై అందరి దృష్టి పడిందని శ్రీశ్రీ రవిశంకర్ తెలిపారు. అనేక అడ్డంకులను అధిగమించి కొన్నేండ్లుగా యోగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ చూరగొన్నదని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. యోగా అనేది ఒక విజ్ఞాన శాస్త్రమని పేర్కొన్నారు. మనలోని అంతర్గత నైపుణ్యాలను అధ్యయనం చేయడానికి, సమన్వయం చేసుకునేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ‘వసుదైక కుటుంబానికి యోగా’ అనే థీమ్తో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు ఐరాస వెల్లడించింది.