రాయ్చూర్, ఏప్రిల్ 11: మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారుతున్న కర్ణాటకలో ముస్లింలే లక్ష్యంగా హిందూత్వ సంస్థ శ్రీరామ్సేన మరో వివాదాస్పద ప్రకటన చేసింది. ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా హిందువులందరూ ‘లవ్ కేసరీ’ని ఒక ఉద్యమంగా ప్రచారం చేయాలని శ్రీరామ్సేన ప్రతినిధి రాజాచంద్ర పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ‘లవ్ జిహాద్’ కేసులే ఉండకుండా చేయాలని, చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ చేతిలో ఖడ్గాన్ని ఎత్తిచూపారు. ‘గుజరాత్లోని గోద్రా ఘటనను పునరావృతం చేయాలనుకొంటున్నారా? ఇది కర్ణాటక. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి’ అని జేడీఎస్ నేత కుమారస్వామి మండిపడ్డారు. ఇలాంటి సంస్థలను ప్రోత్సహించడాన్ని బీజేపీ మానుకోవాలని హితవు పలికారు.