పక్షులు, జంతువులకు కొన్నిసార్లు నీళ్లు దొరకక అల్లాడిపోతుంటాయి. కొంతమంది వాటి బాధను అర్థంచేసుకుంటారు. మూగజీవాలకోసం నీటిని అందుబాటులో ఉంచుతారు. కాగా, దాహంతో అల్లాడుతున్న ఉడుతకు ఓ మహిళ నీళ్లందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఉడుత వాటిర్ బాటిల్తో నీళ్లు తాగడం నెటిజన్లను ఆకట్టుకుంది. మానవత్వం చాటిన ఆ మహిళపై ప్రశంసల జల్లు కురిసింది.
ఈ వీడియోను ‘బిటింగెబిడెన్’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఇందులో ఉడుత దాహంతో ఉంటుంది. అది గమనించిన ఓ మహిళ తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్తో నీళ్లు అందించింది. ఉడుత తన ముందటి కాళ్లతో వాటర్బాటిల్ పట్టుకుని నీళ్లు తాగింది. ఈ వీడియో నెటిజన్ల హృదయాన్ని కదిలించింది. ఉడుత దాహం తీర్చినందుకు ఆమెను అందరూ అభినందించారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 1.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 7,300 కంటే ఎక్కువమంది రీట్వీట్ చేయగా, ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
Stay hydrated.. pic.twitter.com/Tfq3Qdco72
— Buitengebieden (@buitengebieden) June 26, 2022