న్యూఢిల్లీ : ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్ ఎయిర్లైన్ సిస్టమ్స్ మంగళవారం రాత్రి సైబర్ దాడి జరిగింది. దీంతో తెల్లవారు జామున పలు విమానాల రాకపోకలకు సంబంధించి ప్రభావం చూపాయి. ఇది ర్యామ్సన్వేర్ (ransomware) వైరస్ దాడని విమానయాన సంస్థ ప్రతినిధి తెలిపారు. సైబర్ దాడి కారణంగా ఉదయం విమానాల రాకపోకలపై ప్రభావం చూపింది. అయితే, వెంటనే గమనించిన ఐటీ బృందం సత్వరమే చర్యలు చేపట్టిందని, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిందని, ప్రస్తుతం పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దినట్లు తెలిపారు. విమానాలన్నీ సాధారణంగానే నడుస్తున్నాయని పేర్కొన్నారు.