న్యూఢిల్లీ: రెండేండ్ల విరామం తర్వాత బోయింగ్ 737 MAXని స్పైస్జెట్ తిరిగి నడపున్నది. మంగళవారం నుంచి దీని సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్లు స్పైస్జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల దీనిని గ్రౌండ్ చేయడంతో భారీ నష్టాలను ఎదుర్కొన్నట్లు ఆయన చెప్పారు. మూడు సంవత్సరాల క్రితం ఈ విమానాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఆరు నెలల పాటు నడిపామని, ఎటువంటి సంఘటనలు జరగలేదని వెల్లడించారు. ప్రయాణీకులు కూడా ఈ విమానం పట్ల సంతోషంగా ఉన్నారన్నారు.
కాగా, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడానికి మంగళవారం పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, తమ కుటుంబ సభ్యులతో కలిసి గ్వాలియర్కు ఈ విమానంలో ప్రయాణిస్తామని అజయ్ సింగ్ తెలిపారు. త్వరలో ఈ విమానంలో బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను అందిస్తామన్నారు.