న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ఎక్స్ప్రెస్వేలలో వాహనాల వేగ పరిమితిని గంటకు 140 కిలోమీటర్లకు పెంచేందుకు తాము సానుకూలమని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ మేరకు వివిధ క్యాటగిరీల్లోని రహదారుల్లో వాహన గరిష్ఠ వేగ పరిమితిని సవరించేందుకు త్వరలోనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడుతామని ప్రకటించారు. చాలామందిలో కార్ల వేగం పెరిగితే ప్రమాదాలు జరుగుతాయనే అభిప్రాయం ఉన్నదని చెప్పారు. శుక్రవారం ఇండియా టుడే కాంక్లేవ్-2021లో ఆయన మాట్లాడుతూ.. వేగ పరిమితి నాలుగులేన్ల జాతీయ రహదారులపై గంటకు 100 కిలోమీటర్లు, రెండు లేన్ల జాతీయ రహదారిపై 75 నుంచి 80 కిలోమీటర్లు ఉండాలని పేర్కొన్నారు. కారు వేగంపై సుప్రీంకోర్టు, హైకోర్టులు తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రస్తుతం తామేమీ చేయలేకపోతున్నామని అన్నారు.