న్యూఢిల్లీ : మనీలాండింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఆయన ఆసుపత్రిలో ఉన్నందున.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కోర్టు కోరింది. ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో జైన్ సోమవారం ఇక్కడి ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద మే 30న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనను అరెస్టు చేసింది.
మొదట ఆయనను తీహార్ జైలు నుంచి జీబీపంత్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఎల్ఎన్జేపీకి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలుకడగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయిందని, ఎలక్ట్రో కార్డియోగ్రఫీ (ECG)లో కొన్ని మార్పులు కనిపించాయని, ఆ తర్వాత అతన్ని హార్ట్ చెకప్ కోసం ఆసుపత్రికి పంపామని సీనియర్ జైలు అధికారి తెలిపారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న జైన్.. హవాలా లావాదేవీల ఆరోపణలపై పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ జరుపుతున్నది.