న్యూఢిల్లీ: అరాచక శక్తులకు ఆశ్రయమివ్వడం మాని, వారిపై చర్యలు తీసుకోవాలని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్చీ కెనడాను కోరారు.
సిక్కు వేర్పాటు వాది పన్నూ హత్యకు భారతీయుడు కుట్ర పన్నారని ఆమెరికా ఆరోపణలు చేసిన క్రమంలో భారత్ స్వరంలో మార్పు వచ్చిందని కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలపై బాగ్చీ మాట్లాడుతూ భారత వ్యతిరేక శక్తులపై కెనడా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు.