లక్నో: లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో సీట్ల పంపకాల్లో భాగంగా, కాంగ్రెస్కు ఉత్తర ప్రదేశ్లో 17 స్థానాలను కేటాయిస్తామని అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ చెప్పింది. ఆ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి సోమవారం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్కు 17 లోక్సభ స్థానాలను ఇస్తామని అంతిమంగా చెప్పామన్నారు. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్ర మంగళవారం రాయ్బరేలీలో జరగబోతున్నదని, తమ ఆఫర్ను కాంగ్రెస్ అంగీకరించడంపైనే ఈ యాత్రలో అఖిలేశ్ పాల్గొనడం ఆధారపడి ఉంటుందని చెప్పారు.