Yogi Adityanath | సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హిందువులకు వ్యతిరేకంగా, శ్రీరామ భక్తులకు వ్యతిరేకంగా క్రిమినల్ కేసులు నమోదు చేసిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. మరోవైపు.. ఉగ్రవాదులను అభినందించిందన్నారు. ఉగ్రవాద మూలాలకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో చౌహాన్ సమాజ్ ప్రతినిధుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. విపక్ష పార్టీలపై ప్రత్యేకించి సమాజ్వాదీ పార్టీపై నిప్పులు చెరిగారు.
శ్రీరామ భక్తులపై కాల్పులు జరిపినందుకు సమాజ్వాదీని క్షమిద్దామా? అని ప్రజలను ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణ మాఫీకి చర్యలు తీసుకుందన్నారు. కానీ 2012లో ఎస్పీ అధికారంలోకి వచ్చీ రాగానే ఉగ్రవాదులపై కేసులు విత్డ్రా చేసుకుందని ఆరోపించారు.
జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేందుకు రాజ్యాంగంలో 370 అధికరణాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదానికి పునాదులు వేసిందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఎస్పీ నేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్ యాదవ్.. రాష్ట్ర ప్రగతి కోసం చేసిందేమీ లేదన్నారు.