లక్నో : గోరఖ్నాధ్ ఆలయంపై దాడి కేసులో కాషాయ పార్టీ హడావిడి చేస్తోందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బుధవారం ఆరోపించారు. ఈ అంశంపై దర్యాప్తులో నిందితుడి మానసిక స్ధితిని కూడా అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తన కుమారుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని ఆయన తండ్రి చెబుతున్న విషయాన్ని అఖిలేష్ గుర్తుచేశారు. బీజేపీ ఈ విషయాన్ని పెద్దదిగా చేస్తోందని ఆరోపించారు.
ఇక గోరఖ్నాధ్ ఆలయంపై దాడి కేసులో నిందితుడు అహ్మద్ ముర్తజా అబ్బాసీని తదుపరి దర్యాప్తు కోసం లక్నోలోని యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్) ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. యూపీ పోలీసులు అతడి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. ఆదివారం రాత్రి గోరఖ్నాధ్ ఆలయ ప్రాంగణంలోకి చొచ్చుకువచ్చిన ముర్తజా అక్కడ విధుల్లో ఉన్న పోలీసులపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు.
ఈ దాడికి పాల్పడిన ముర్తజా గోరఖ్పూర్ వాసిగా గుర్తించారు. దాడి వెనుక ఉగ్ర కుట్ర దాగి ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నామని ఏడీజీ (శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఇక తమ కుమారుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని, అతడిని నేరం చేసే ప్రణాళిక లేదని నిందితుడి తండ్రి మునిర్ అహ్మద్ అబ్బాసి చెబుతున్నారు.